ఈమద్య సోనూసూద్ గురించిన ప్రతి విషయం కూడా వైరల్ అవుతోంది.ఆయన ఏం చేసినా కూడా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.
ఏం మాట్లాడుతాడో అంటూ అంతా ఆసక్తిగా వింటున్నారు.ఇలాంటి సమయంలో ఆయన సుశాంత్ ఆత్మహత్య ఆ తర్వాత జరుగుతున్న పరిణామల గురించి మాట్లాడాడు.
ఈ సందర్బంగా ఈయన హీరోయిన్ కంగనా రనౌత్ పేరు ఎత్తకుండానే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుశాంత్ మరణించిన తర్వాత నెపొటిజంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై సోనూసూద్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
మరణించిన వ్యక్తితో గతంలో ఎప్పుడు కలవని మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఆయన మరణంను అడ్డు పెట్టుకుని మాట్లాడటం విచిత్రంగా ఉంది.అతడి మరణంను స్వప్రయోజనాల కోసం ఆమె వాడుకుంటుందనే అనుమానం కలుగుతోంది.
సుశాంత్ను ఏనాడు కలవని ఆమె ఇప్పుడు అతడి మరణం గురించి నెలన్నర రోజులుగా మాట్లాడుతూనే ఉందని ఎద్దేవ చేశాడు.సుశాంత్ గురించి ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వారంతా కూడా పబ్లిసిటీ కోసం స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అనే అనుమానం కలుగుతుందని ఈ సందర్బంగా సోనూసూద్ అన్నాడు.
తనపై చిన్న కామెంట్స్ చేసినా కంగనా ఊరుకోదు.అది ఎంత పెద్ద స్టార్ అయినా కౌంటర్ పడాల్సిందే.అలాంటిది సోనూసూద్ను ఇప్పుడు ఆమె వదలుతుందా అనేది చూడాలి.ఒక వేళ సోనూసూద్ను కంగనా టార్గెట్ చేసి చిన్న కౌంటర్ వేసినా ప్రస్తుతం సోనూసూద్కు సోషల్ మీడియా ఫాలోయింగ్తో ఆమె కొట్టుకు పోవడం ఖాయం అంటున్నారు.
మరి కంగనా ఏం చేస్తుందో చూడాలి.