ఆయన సినిమాల్లో విలన్.కానీ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో.
కష్టాల్లో ఉన్నారని తెలిస్తే అర క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు “సోనూ సూద్” పుట్టినరోజు ఈ రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు మరియు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా మాధ్యమాలు ద్వారా సోను సూద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అంతేగాక సోనూ సూద్ చేసినటువంటి మంచి పనులను తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.
అంతేగాక మనం ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా సరే చివరికి మనకు మిగిలేది కేవలం ఆరడుగుల నేల మాత్రమేనని, కానీ ప్రజలకు చేసిన మంచి మాత్రం మనం చనిపోయిన తరువాత కూడా కొన్ని తరాల వరకు గుర్తు ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో సోనూసూద్ కి సంబంధించినటువంటి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం అందించేందుకు గాను సోనూసూద్ దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతేగాక ఇంతటి కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా ప్రజలకి సేవలందిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు, వైద్యులు మరియు పోలీసులు తదితర విభాగాల అధికారులకు ముంబై లో ఉన్నటువంటి తన హోటళ్లలో ఉచితంగా బస ఏర్పాటు చేయడమేగాకుండా ఉచిత భోజన వసతిని కూడా కల్పిస్తున్నారు.
దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ “దేవుడు మనిశ్య రూపేనా” అంటూ సోను సూద్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనూసూద్ బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న “పృథ్వీరాజ్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే తమిళంలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఆచార్య చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై మాత్రం ఇప్పటివరకు సోనూసూద్ స్పందించలేదు.