సోను నిగమ్ ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన పేరు వినగానే అతడు పాడిన పాటలతో మనసు కాస్త తేలికగా అయిపోతుంది.
బాలీవుడ్ పాప్ సింగర్ అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీతో ఇతనికి మంచి అనుబంధం ఉంది.తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకాదరణ దక్కించుకున్నారని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సింగర్ ఓ పని నిమిత్తం మహారాష్ట్రలోని ఉజ్జయినికి వెళ్లి అక్కడ ఒక హోటల్లో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆ హోటల్లో నివసిస్తున్నటువంటి ఈ సింగర్ అదే హోటల్లో ఓ పెళ్ళి కార్యక్రమం జరుగుతుంటే ఎవరూ ఊహించని విధంగా ఆ పెళ్లికి పిలవకపోయినా పిలవని పేరంటానికి అతిథిగా వెళ్లినట్టు ఆ పెళ్లికి హాజరు అయ్యి వధూవరులను ఆశీర్వదించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
అసలు ఎవరూ ఊహించని విధంగా ఒక సింగర్ వారి పెళ్ళికి రావడం ఏంటి అని ఆశ్చర్యంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఉన్నారు.
అయితే సోనూ వేదిక పైకి వెళ్ళే సమయానికి అక్కడ అప్పగింతల కార్యక్రమం జరుగుతుండడంతో అమ్మాయి కన్నీటితో తన తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ ఉండగా ఆ సమయంలో ఇతను వెళ్లేసరికి తన కన్నీటిని మరిచిపోయి ఎంతో సంతోషంతో చిరునవ్వులు చిందించారు.సోను అక్కడ ఉన్నది కేవలం ఐదు నిమిషాలు అయినప్పటికీ ఈ సంఘటనను వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఈ సందర్భంగా ఆ జంట తెలిపారు.ఏది ఏమైనా ఇలా పిలవని పేరంటానికి అతిథిగా వెళ్లి అందరిని సింగర్ సోనూ నిగమ్ ఎంతో సంతోషపరిచారని చెప్పవచ్చు.