ఒకసారి కొంత మంది నటీనటులకి నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాల విషయంలో తాము తీసుకున్నటువంటి నిర్ణయాలే వారి సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంటాయి.కాగా తెలుగులో నూతన దర్శకుడు రమేష్ రాయల్ దర్శకత్వం వహించిన “ఈ వయసులో” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన తెలుగు నటి “తీర్థ” తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.
అయితే నటి తీర్థ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాలకోసం చాలా ప్రయత్నాలు చేసింది.ఎలాగైనా నా ఒక్క అవకాశాన్ని దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకావాలని కలలు కనింది.
ఈ క్రమంలో “ఈ వయసులో” అనే చిత్రంలో ఓ బోల్డ్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.కానీ ఈ చిత్రం కనీసం విడుదలయినట్లు కూడా చాలా మందికి తెలియదు.
అయినప్పటికీ ఈ అమ్మడి పాత్రకి మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.దీంతో తెలుగులో ప్రముఖ హీరో రాజా, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, స్వర్గీయ నటుడు జయప్రకాష్ రెడ్డి, తదితరులు నటించిన “సొంత ఊరు” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.
అయితే ఈ చిత్రంలో తీర్థ పాత్ర కొంతమేర బోల్డ్ తరహాలో ఉంటుంది.
అయినప్పటికీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో నటి తీర్థ సినిమా కెరియర్ దాదాపుగా ముగిసి పోయింది.అంతేగాక హీరోయిన్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నటి తీర్థ కలలు చిద్రమైపోయాయి.
దీంతో సినిమా కెరియర్ ని దృష్టిలో ఉంచుకొని అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలు మరియు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటించినప్పటికీ నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
కాగా ఆ మధ్య తెలుగులో దర్శకుడు “తేజ” దర్శకత్వం వహించిన “నీకు నాకు డాష్ డాష్” అనే చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ నటి తీర్థ కి మాత్రం అవకాశాలను తెచ్చి పెట్టలేకపోయింది.దీంతో అప్పటి నుంచి నటి తీర్థ సినిమా పరిశ్రమకు కొంతమేర దూరంగా ఉంటోంది.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఎక్కడ ఉంది.? ఏం చేస్తుందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.