కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కరోనా విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.దేశంలో కరోనా ని కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు జవాబుదారీతనం ఉండేలా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక దేశంలో చాలా రాష్ట్రాల నాయకులు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ రీతిగా వ్యాప్తి చెందడానికి గల కారణం మోడీ ప్రభుత్వమే అంటూ మండిపడుతున్నారు.
పరిస్థితులను అంచనా వేయకుండా ఎన్నికలు నిర్వహించటం మాత్రమే కాక కుంభమేళ వంటి కార్యక్రమాలు జరగటం వల్ల దేశంలో భయంకరంగా వైరస్ విస్తరించింది అని కేంద్రంపై మండిపడుతున్నారు.పోనీ ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ అయినా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు ఉన్నాయా అంటే అది కూడా లేదు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
<