కరోనా వ్యాక్సిన్ విషయానికి సంబంధించి మోడీకి సోనియాగాంధీ లెటర్ రాయడం జరిగింది.వయసుతో నిమిత్తం లేకుండా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని లెటర్ లో కోరారు.
అంత మాత్రమే కాక ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత ఉందని దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.మరోపక్క డే విషయానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా మొదట స్వదేశంలో ఉన్నవారికి వ్యాఖ్యానం దించిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తే బాగుంటుందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో అగ్రరాజ్యం అమెరికాతో దాదాపు ఇండియా పోటీపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.దీనికి అసలు కారణం దేశంలో చాలా వరకు ప్రజలు కరోనా నిబంధనలు పాటించక పోవటమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది.కేసుల పరంగా భారత్ రెండవ స్థానంలో ఉండగా, మృతుల సంఖ్య పరంగా లక్షా 70వేలతో నాల్గవ స్థానంలో ఉంది.
ఇదే పరిస్థితి మరీ నెల రోజులు కొనసాగితే ఇండియాలో.శవాలు కుప్పలుతెప్పలుగా పడిపోవటం గ్యారెంటీ అనే టాక్ అంతర్జాతీయ మీడియాలో వినబడుతోంది.