కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది.ఈ క్రమంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.
ఈ మేరకు ఆమె కర్ణాటకలోని మైసూర్ కు చేరుకున్నారు.ఎల్లుండి సోనియా పాదయాత్రలో పాల్గొననుండగా.
ఈనెల 7న ప్రియాంకా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా కర్ణాటక తర్వాత తెలంగాణలోకి ప్రవేశించనుంది.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రకు కావాలసిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.