తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సోనియా గాంధీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.మేడ్చల్లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదిక వద్దకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సోనియా గాంధీ మొదటిసారి రావడంతో.సోనియా గాంధీ ఏం మాట్లాడతారా ? అనేదానిపై పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు సోనియా గాంధీ సమక్షంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు … టీఆర్ఎస్ నుంచి తాజాగా సస్పెండ్ అయిన యాదవరెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వరరెడ్డి చేరబోతున్నట్టు తెలుస్తోంది.