జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ సమావేశం సుధీర్ఘంగా సాగింది.ఉదయం నుంచి పది గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చించారు.
సమావేశం కొద్ది క్షణాల ముందే ముగిసింది.అయితే ఈ సమావేశంలో తీర్మానించిన విషయాలపై పార్టీ మీడియాకు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
అయితే ఉదయం నుంచి సమావేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.వాదనలు, ప్రతివాదనలు, అలకలు, బుజ్జగింపుల మధ్య సాగిన ఈ సమావేశంలో చివరకు అధ్యక్ష పదవిలో మార్పు లేకుండా ముగిసింది.
అయితే ఈ సమావేశంలో చివరకు మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే ఎన్నుకున్నారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రి ఏకే అంటోని ప్రతిపాదించారు.
అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని వాదనలు వినిపించాయి.ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ అధ్యక్ష పదవి వేరే వాళ్లకు ఇవ్వాలని గట్టి వాదనలే వినిపించారు.
చివరికి సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగాలని కొందరు సీనియర్ నాయకులు మొగ్గు చూపారు.దీంతో కాంగ్రెస్ అధ్యక్షరాలిగా సోనియానే మళ్లీ తీర్మానించారు.