డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆరంభంలో వెబ్ సిరీస్ లపై సెలబ్రిటీలు ఒకింత చిన్న చూపు చూసిన కరోనా వచ్చి వారి ఆలోచన మొత్తం మార్చేసింది.భవిష్యత్తు మొత్తం వెబ్ సిరీస్, డిజిటల్ చానల్స్ దే హవా అని అర్ధం కావడంతో ఇప్పుడు వారంతా అందులోకి మంచి కాన్సెప్ట్ చూసుకొని ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే సౌత్ ఇండియా నుంచి సీనియర్ హీరోయిన్స్ అయిన కాజల్, తమన్నా, సమంత ఎంట్రీ ఇచ్చేశారు.మిగిలిన కుర్ర హీరోయిన్స్ కూడా సినిమాలతో పాటునే వెబ్ సిరీస్ లు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు.
సినిమాలలో హీరోయిన్ పాత్రకి స్కోప్ తక్కువగా ఉంటుంది.అదే వెబ్ సిరీస్ లలో అయితే ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తమ పెర్ఫార్మెన్స్ షో అప్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ ఫామ్ అని భావిస్తున్నారు.
అందుకే వెబ్ సిరీస్ లవైపు అడుగులు వేస్తున్నారు.ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా కూడా డిజిటల్ ఎంట్రీ ఖరారు చేసుకుంటున్నారు.ఇప్పటికే ఇలియానా, హ్యూమా, రాధిక లాంటి స్టార్స్ అందరూ వెబ్ ఎంట్రీ ఇచ్చేశారు.ఇప్పుడు వీరి సరసన స్టార్ నటి సోనాక్సి సిన్హా కూడా చేరుతుంది.
ఈమె ఓ సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో నటించడానికి ఒకే చెప్పేసింది.శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో బుల్బుల్ తరంగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ లో వరకట్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక మధ్యతరగతి అమ్మాయి పాత్రలో సోనాక్షి కనిపించబోతుందని తెలుస్తుంది.
ఇక దీంతో పాటు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ కాన్సెప్ట్ షోలో కూడా సోనాక్షి కనిపించబోతుంది.