శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది.కొంతమందికి కరోనా వైరస్ సోకి ప్రాణాలు తీస్తూ ఉంటే ఇంకొంతమందికి కరోనా అనే భయంతోనే ప్రాణాలను తీసేస్తుంది ఈ రక్కసి.
తాజాగా జరిగిన ఘటన అందరినీ కలిచి వేస్తోంది.కొడుకు కరోనా వైరస్ రక్కసి బారిన పడ్డాడని… తెలిసి తండ్రి గుండె ఆగిపోయింది.
తండ్రి మరణవార్త విని కొడుకు ప్రాణం పోయింది.
చిత్తూరు జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ఏకాంబరకుప్పం లో హృదయాన్ని కలచి వేసే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.కొడుకు కరోనా వైరస్ బారిన పడ్డాడు అన్న మనస్థాపంతో తండ్రి గుండె ఆగిపోయింది.
తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు అన్న వార్త విన్న కొడుకు కరోనా వైరస్ తో పోరాడలేక ప్రాణాలు వదిలాడు.
ఇక తండ్రి అంత్యక్రియలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.
పోలీసులు రెవెన్యూ అధికారులు అంతిమ సంస్కారాలు నిర్వహించడం నిజంగా విషాద ఘటన అని చెప్పాలి.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
భారీ మొత్తంలో కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలను మరింత ఆందోళన పెరిగిపోతుంది.