అల్లు అర్జున్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో రాబోతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథ అంటూ ఒక చిన్న స్టోరీ లైన్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ కథలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే ఆ కథ ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువ మందిలో కనిపిస్తోంది.
భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా కథ బయటకు రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఇంతకు కథ ఏంటంటే… సత్యమూర్తికి వెన్నెల కిషోర్ మరియు అల్లు అర్జున్లు ఇద్దరు కొడుకులు.
మిలియనీర్ అయిన సత్యమూర్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాలకు విస్తరిస్తాడు.తండ్రి మిలియనీర్ అవ్వడంతో అల్లు అర్జున్ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉంటాడు.
అయితే కొన్ని కారణాల వల్ల సత్యమూర్తి వ్యాపారంలో లాస్ వచ్చి, సత్యమూర్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోతాడు.తండ్రి చనిపోవడంతో వెన్నెల కిషోర్ పిచ్చి వాడు అవుతాడు.
సత్యమూర్తి చనిపోయే ముందు కొడుకులతో మీకు అత్త ఉందని, ఆమెతో మీరు కలిసి ఉండండి అంటూ చెబుతాడు.దాంతో రాయలసీమలోని అత్త చెంతకు వెళ్తాడు అల్లు అర్జున్.
అక్కడ బన్నీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, సమంత ఎవ్వరు అనేది మిగిలిన కథాంశం.