కరోనా వైరస్.మనిషిలోని మానవత్వాన్ని చంపేసింది.పక్కన మనిషి చచ్చిపోయిన పట్టించుకోని రోజులు ఇవి.అప్పటివరకు కలిసి తిరిగి.కలిసి తిని.కలిసి పెరిగిన కరోనా వైరస్ వచ్చింది అంటే నువ్వు ఎవరు అంటున్నారు.ఇంకా కరోనా వైరస్ మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కావడం లేదు.కనీసం సాయం అందించడం లేదు.
ఇంకా బయట వాళ్ళు ఇలా ఉన్నారు మన కుటుంబసభ్యులు మనల్ని చూసుకోవాలి.కానీ కొందరు రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు.మొన్నటికి మొన్న కోడలికి కరోనా పాజిటివ్ అని అత్త తనని ఇంట్లోకి రానివ్వలేదు.ఇప్పుడు ఓ కొడుకు కన్నతల్లిని రోడ్డు పాలు చేశాడు.
కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆమెను రోడ్డుపైనే వదిలేసి వెళ్ళాడు ఆ మనసులేని కొడుకు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
హైదరాబాద్ ఫిలిం నగర్లోని బీజేఆర్ నగర్కు చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కాగా, ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది.
దీంతో ఆమెను ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు.కరోనా ను జయించిన ఆనందం ఆమెలో ఎంతోసేపు లేకుండా చేశాడు కన్నకొడుకు.
ఆ మహిళను కొడుకు, కోడలు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు.అంతేకాదు ఇంటిపై కప్పుకున్న రేకులు కూడా ధ్వంసం చేసి ఇంటికి తాళం వేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
దీంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ రోడ్డు పక్కనే గడిపింది ఆ బాధితురాలు.అనంతరం తనకు న్యాయం చెయ్యాలని భాదితురాలు అధికారులను వేడుకుంది.