కరోనా వైరస్ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.ఒక మనిషిని కనికరంలేని మృగంగా మార్చేస్తుంది ఈ కరోనా రక్కసి.
కరోనా భయం తో బంధాలు బంధుత్వాలు కూడా మరచిపోయి మానవత్వం లేని మనుషులు గా మరి పోతున్నారు జనాలు.తాజాగా జరిగిన సంఘటన చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
కరోనా భయం ఏకంగా జన్మనిచ్చిన తల్లిని కూడా ఒంటరి దాన్ని చేసింది.
తల్లికి కరోనా సోకిందని నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కొడుకు తల్లిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.ఈ ఘటన గుంటూరులోని మాచర్ల బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది.70 ఏళ్ల వృద్ధ తల్లి ని కరోనా పాజిటివ్ అని రావడంతో బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు కొడుకు.
పాల్వని అనే వృద్ధ మహిళ గత కొంతకాలంగా గోవాలోని తన కూతురు వద్ద ఉంటుంది.పెన్షన్ తీసుకుందామని గుంటూరు లోని మాచర్ల లో ఉంటున్న తన కొడుకు వద్దకు వచ్చింది.
ఇక వేరే రాష్ట్రం నుంచి వచ్చిన సదరు మహిళకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.దీంతో మానవత్వం లేని వాడిగా మారిన ఆ మహిళ కొడుకు… నిర్దయగా జన్మనిచ్చిన తల్లిని మాచర్ల బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు.
ఇది గమనించిన స్థానికులు ఆమెను గుంటూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.