ఇటీవల దిశా హత్యాచారం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఘటనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
కాగా ఇలాంటి చర్యలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వాలు వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.అటు ఏపీ సర్కార్ ఇప్పటికే దిశ చట్టంకు ఆమోదం కూడా తెలిపింది.
అయితే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఘోరాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా హైదారబాద్ నగరంలోని పంజాగుట్టలో ఓ దారుణం వెలుగు చూసింది.
అత్తపై అల్లుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పంజాగుట్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న హార్ధిక్ గాంధీ, ప్రశాంతి దంపతులతో కలిసి ప్రశాంతి తల్లి నివసిస్తుంది.గత నెల 13న ఆమె తీవ్ర డిప్రెషన్ కారణంగా నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోయింది.
కాగా మద్యం మత్తులో రాత్రి ఇంటికి వచ్చిన అల్లుడు, అత్త గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.ఈ విషయం తన కూతురికి చెప్పి ఆ తల్లి విలపించింది.
కాగా మరుసటి రోజు హార్ధిక్ గాంధీ ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానని, తనకు విడాకులు ఇస్తానని చెప్పి భార్యకు ఫోన్ చేశాడు.దీంతో శుక్రవారం రాత్రి ప్రశాంతి తల్లితో కలిసి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మద్యం మత్తులో వావివరసలు మరిచే హార్ధిక్ గాంధీ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.