ఒకప్పుడు కొడుకుకు తల్లి దండ్రి తరువాతే ఎవరైనా అన్నట్లు ఉండేది.కానీ ఈ జనరేషన్ లో మాత్రం భార్య తరువాతే కన్న తల్లితండ్రి అన్న విషయం అర్ధం అవుతుంది.
అందుకే ఈ రోజుల్లో అనాధ ఆశ్రమాల కంటే కూడా వృద్దాశ్రమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే పెళ్లి అయి భార్య చెప్పుడు మాటలు విని కన్న తల్లి దండ్రులను అశ్రద్ధ చేస్తున్న కొడుకులు ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయారు.
అయితే ఒక ప్రబుద్దుడు మాత్రం ఇంకా పెళ్లి కూడా కాకుండానే లవర్ కోసం అని అమ్మ నగలను,డబ్బును దోచుకెళ్లి సంచలనం సృష్టించాడు.హైదరాబాద్ లోని బోరబండ లోని ఎస్ ఆర్ ఆర్ పురం కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో నివసించే అరుణ్ అనే యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు.
అయితే ఆ అమ్మాయికి ఆశ్యర్చపరిచే గిప్టులు ఇవ్వడం తో పాటు వీకెండ్స్లో పార్టీలు, ఔటింగ్లు ఇలా ఒక్కటేమిటి అన్నీ కూడా చాలా కాస్ట్లీ గా ప్లాన్ చేయాల్సి ఉంటుందట.అయితే ఒకపక్క ఎలాంటి సంపాదన లేని ఈ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ కి తక్కువ చేయకూడదు అన్న లెక్క లో ఏకంగా తల్లి బంగారం తో పాటు ఆమె దాచుకున్న డబ్బులు కూడా దోచుకొని ఎస్కేప్ అయ్యాడు.
వన్ ఫైన్ డే.ఆమె దాచుకున్న 8 తులాల బంగారం, 50 వేల డబ్బుతో ఎస్కేప్ అయ్యాడు.కేడీ కొడుకు చోరిని గుర్తించిన అతని అమ్మ.ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రబుద్దుడి కోసం గాలిస్తున్నారు.
మొత్తానికి లవర్ కోసం ఏకంగా అమ్మనగలను కూడా ఎత్తు కెళ్లే స్థాయికి ఎదిగిపోతున్నారు కొడుకులు.