జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీతో పొత్తు కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారన్నారు.
వైసీపీ, టీడీపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.ఈ క్రమంలో వైసీపీ అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.