ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు గోల ఒక పక్క అయితే మరో పక్క కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం పట్ల రకరకాల విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం తమ సొంతంగా పేర్లు పెట్టుకుని పథకాలు అమలు చేస్తుందని విమర్శలు చేశారు.
ఇక పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరింపులకు అధికార పార్టీ పాల్పడుతోందని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ ని పోటీ పార్టీగా వైసీపీ భావిస్తున్నట్లు సోము వీర్రాజు అభివర్ణించారు.
పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అధికార పార్టీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు.అంతేకాకుండా వైసీపీ విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపణలు చేశారు.