తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకపక్క బిజెపి, మరోపక్క జనసేన పార్టీలు ప్రజా ఉద్యమాలను భుజాన వేసుకున్నాయి.కొద్దిరోజులుగా బిజెపి జనసేన పార్టీలు ఏపీ రాజకీయాలలో వేడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయం క్లారిటీ లేకపోయినా, రెండు పార్టీలు గట్టిగా జనాల్లో బలం పెంచుకు ని తిరుపతి ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నాయి.మొదటి నుంచి బిజెపి ఇక్కడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలవాలని భావిస్తుండగా, జనసేన సైతం తిరుపతిలో తమకు బలం ఎక్కువ ఉందని, తప్పనిసరిగా తమ అభ్యర్థిగా పోటీలోకి దిగితే విజయం తమదేనని హడావుడి చేస్తూ వచ్చారు.
ఈ విషయంపై క్లారిటీ దొరకకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ రేగుతూ వచ్చింది.అయితే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకు బరిలోకి దిగగా, బీజేపీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు.
అక్కడ చేసిన త్యాగానికి ప్రతిఫలంగా తమకు తిరుపతి టికెట్ ఇస్తారని జనసేన నాయకులు భావిస్తూ వస్తుండగా, క్లారిటీ లేకపోవడంతో ఇటీవలే పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కలిసి తిరుపతి తో పోటీ చేసే విషయమై ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది.
ఆ తర్వాత సైలెంట్ గా ఏపీ కి వచ్చారు.
తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీక్ష సైతం చేపట్టారు.కానీ బీజేపీ ని ఈ విషయంలో సంప్రదించలేదు.
ఈనెల 28వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దానికి కూడా బిజెపికి ఆహ్వానం ఉంటుందో లేదో తెలియదు.
ఇదిలా ఉంటే, తాజాగా బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి లో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అని, జనసేన తమకు మద్దతు ఇస్తుందని ,ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కలిసిన సందర్భంలో తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారనే విషయాన్ని సోము వీర్రాజు బయటపెట్టడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.
వీర్రాజు మాటలను బట్టి చూస్తే, మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడే తిరుపతి సీటును పవన్ త్యాగం చేసినట్లు గా అర్ధం అవుతుంది.కాని ఈ విషయం ఇప్పటివరకు బయట పెట్టలేదు.కానీ సోము వీర్రాజు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనంగా మారింది.