సిఎం జగన్ పై బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు ఫైర్…ఏపీలో బిజేపీకి అధికారమిస్తే మూడేళ్ళల్లో అమరావతి లో రాజధాని కట్టేస్తాం.ప్రధాని మోడీ నాయకత్వంలో ఏపీలో అధికారంలోకి వస్తాం.
బిజేపీకి అధికారమిస్తే హోదా కంటే ఎక్కువ నిధులు తెస్తాం- ఏపీని సమగ్ర అభివృద్ధి చేస్తాం.మైండ్ గేమ్ లు ఆడేవారికి బిజేపీ చరమగీతం పాడుతుంది.
జనసేన -బిజేపీతోనే వుంది.పొత్తుల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఆ గేమ్ లలో పడొద్దని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా…ధవలేశ్వరం బ్యారేజ్ పునరుద్దరణచర్యలకై 700 కోట్లు కేంద్రం ఇవ్వనుంది.
రైల్వేప్రాజెక్టులకు 66 వేలకోట్లు భారీగా నిధులిచ్చి ఏపీలో అభివృధ్ధి చేస్తున్నాం.జాతీయరహదారి రోడ్లు పెద్ద ఎత్తున చేపట్టాం.
కంటిలో నలకలాంటి సినిమా టిక్కెట్ ధరల వ్యవహారాన్ని మైక్రోస్కోప్ లో చూస్తావా.సిమెంటు బస్తా రూ.380 ఎందుకు అమ్ముతున్నారో చెబుతారా.టిక్కెట్ ధరలు ఎందుకు తగ్గిస్తావు? సిమెంటు , ఇసుక ధరలు తగ్గించలేవా…గోదారిలో ఇసుక వున్నా ఒడ్డునున్నవారికి కూడా దొరక్కుండా బంగారం ఎలా అయింది.కేంద్ర సంక్షేమ పధకాలకు జగన్ తన ఫొటోలు పెట్టుకుని అమలు చేయడం సిగ్గుచేటు
.