విజయవాడ: ఆజాదీకా అమృత్ మహోత్సవం చేస్తున్న సందర్భంలో గుంటూరులోని టవర్ కు ఉన్న జిన్నా పేరును తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.జిన్నా దేశ ద్రోహి.
ఇటువంటి ద్రోహుల పేర్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఆజాదీకా అమృత్ మహోత్సవం చేసుకుంటున్న నేపథ్యం లో దేశ ద్రోహుల పేర్లు ఏప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని భారతీయజనతా పార్టీ డిమాండ్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు.