బద్వేల్ ఉపఎన్నిక ఈ నెల అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే బద్వేల్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ముందు భావించిన గాని నిన్న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం లో… చంద్రబాబు టీడీపీ నాయకులతో చర్చించి… పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.చనిపోయిన మృతుడి భార్యకు అధికార పార్టీ వైసీపీ టిక్కెట్ ఇవ్వడం తో…ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమంలో బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదని.ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు.
టీడీపీ -జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ కూడా పోటీకి… దూరంగా ఉంటుందని భావించారు.ఇటువంటి తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
బద్వేల్ ఉప ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని.ఎన్నికల ప్రచారానికి పవన్ ని ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
జనసేన పార్టీతో భిన్నాభిప్రాయాలు తప్ప భేదాభిప్రాయాలు లేవని తప్పకుండా కొనసాగుతుందని ఓ ప్రముఖ మీడియా చానల్ తో.మాట్లాడుతున్న సమయంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం జరిగింది.