భారత్ – చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వ నిషేధానికి గురైన పబ్ జి మొబైల్ తిరిగి భారత్ లో పబ్ జి మొబైల్ ఇండియా పేరిట విడుదలఅవుతోన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు పబ్ జి కార్ప్ ఇటీవలే అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం కూడా జరిగింది.
అయితే ఈ గేమ్ నేడు (మంగళవారం) విడుదలవుతుందని సమాచారం.ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు షికార్లు కొడుతున్నాయి.
పబ్ జి కార్ప్ ఈ గేమ్ విడుదల పై ఇది వరకే ప్రకట చేసినప్పటికీ గేమ్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారనేది తెలపలేదు.కాకపోతే, మంగళవారం మీడియా సమావేశంలో ఈ ఆతను ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
పబ్ జి రీ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా పబ్ జి ఆటగాళ్లకు పబ్ జి కార్ప్ ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది.ఆట ప్రమోషన్ లో భాగంగా భారీ ఎత్తున టోర్నమెంట్ ను నిర్వహించి నగదు బహుమతులను అందచేయనుంది.అందులో భాగంగా రూ.6 కోట్ల వరకు ప్రైజ్ మనీ ని ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా టైర్ – 1 టీం లకు ప్రత్యేకంగా రూ.40వేల నుండి రూ.2 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు సమాచారం.అలాగే వ్యక్తిగత ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్ లో ఆడి బహుమతులు గెలుచుకునేందుకు అవకాశం కలిపించబోతున్నట్లు సమాచారం.
కాకపోతే ఈ వార్తలన్నీ ఎంత వరకు వాస్తవమో చెప్పలేము దీనికి కారణం సోషల్ మీడియాలో ప్రతి విషయము చక్కర్లు కొడుతున్నవే.ఇది ఇలా ఉండగా ఈ విషయం ఫై మాత్రం పబ్ జి కార్ప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయితే బ్యాన్ కు గురయ్యాక ఆట విడుదల కానుందని తెలుస్తుండడంతో పబ్ జి ప్రియులు పండగ తెగ ఆనంద పడిపోతున్నారు.