తెలంగాణ కు కొత్త చీఫ్ సెక్రటరీ గా ఎవరు వస్తారు అనే ఉత్కంఠ చాలా రోజులుగా నెలకొంది.ఈ ఉత్కంఠకు తెర దించుతూ తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణా సీఎస్ గా సోమేశ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది.ఇప్పటి వరకు తెలంగాణా సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ ఎస్ కే జోషి ఈ రోజు రిటైర్ అవ్వడంతో ఆ స్థానంలో సోమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.
అయితే రిటైర్ అయినా జోషికి ప్రభుత్వం మరో ఆఫర్ ఇచ్చింది.ఆయనను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ జీవో జారీ చేసింది.ఇక కొత్తగా నియమితులైన సీఎస్ సోమేశ్ కుమార్ కు మరో మూడేళ్ళ పదవి కాలం ఉంది.సోమేశ్ కుమార్ స్వస్థలం బీహార్.
అయితే కొత్త సీఎస్ గా అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్ ల మధ్య పోటీ నెలకొనగా కేసీఆర్ మాత్రం సోమేశ్ కుమార్ వైపు మొగ్గు చూపించారు.