ఇప్పటికే సవాలక్ష సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇప్పుడు మరో ఇబ్బంది వచ్చిపడింది.టిఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలుు , కర్ణాటకలో సినీ రంగానికి చెందిన ఒక ప్రముఖుడు, కన్నడ సినీ హీరో కు చెందిన హోటల్లో విందు ఏర్పాటు చేయడం , ఆ విందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరవడం వంటివి చోటు చేసుకున్నాయట.
కాకపోతే ఆ విందులో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసుల విచారణలో తేలడంతో, ఆ ఇందులో పాల్గొన్న వారు ఎవరా అనే విషయంపై ఆరా మొదలైంది.అయితే ఆ విందులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.
కాకపోతే ఆ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ల పేర్లు బయటకు రాకపోవడంతో టిఆర్ఎస్ కాస్త కుదుట పడింది.కాకపోతే ఆ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయం పై ఒక స్పష్టత తెచ్చుకునేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది .ఆ విందు జరిగిన తేదీన ఏ ఎమ్మెల్యే ఏ ప్రాంతంలో ఉన్నారు ఏం చేశారు అని ఎంక్వైరీ రహస్యంగా చేయిస్తున్నారట.ఈ మేరకు ఎమ్మెల్యేల గన్ మెన్ లను రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.
దీని ఆధారంగా ఎమ్మెల్యే ఎవరు అనే విషయం స్పష్టంగా తెలుసుకుని వారికి వార్నింగ్ ఇచ్చేందుకు టిఆర్ఎస్ సిద్ధం అవుతోందట.
కాకపోతే ఎమ్మెల్యే ల పేర్లు బయటకు పొక్కితే ప్రభుత్వం తీవ్రంగా రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పుడు ఎదురవుతున్న వరుస ఎదురు దెబ్బల తో పాటు , ఇది మరింతగా తమను దెబ్బతీసేందుకు కారణం అవుతుందని, టిఆర్ఎస్ ఆందోళనలో ఉండటంతోనే , ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఈ విధంగా ఎంక్వైరీ రహస్యంగా చేస్తున్నారట.ఇప్పటికే డ్రగ్స్ విందు వ్యవహారం పై కర్ణాటకలో నాలుగు కేసులు నమోదయ్యాయి.దీంతో టీఆర్ఎస్ మరింత అప్రమత్తంగా ఉందట.