టాలీవుడ్ లో ప్రతి మంగళవారం ఈ టీవీ ఛానల్ లో ప్రసార ఎటువంటి ఆలీతో సరదాగా కామెడీ షో ఎంతగానో ప్రాచుర్యం పొందింది.అయితే తాజాగా ఈ కామెడీ షో లో పాల్గొనడానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవికి దీటుగా పోటీ ఇచ్చినటువంటి నటుడు డు సుమన్ వచ్చి తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఇందులో భాగంగా తనకు ఒకప్పుడు అమ్మాయిలు తమ రక్తంతో లవ్ లెటర్లు రాసి ట్రైన్ కి వెనకాల అతికించి పంపించే వారని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.అయితే గతంలో కూడా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికి తెలుగు ఇండస్ట్రీలో కింద ఫ్లోర్ ను చూడకుండా డాన్స్ చేయగల సత్తా కేవలం మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే ఉందని అని అన్నారు.
అయితే ఈ షోలో తన పూర్తి పేరు సుమన్ తల్వార్ అని చెప్పు కొచ్చాడు సుమన్.అంతేగాక తెలుగు ప్రేక్షక అభిమానులకి తెలుగు అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని అప్పట్లో మాట ఇచ్చానని అందువల్ల చెప్పిన విధంగానే తెలుగు అమ్మాయిని తన భార్యగా వివాహం చేసుకున్నానని అన్నాడు.అంతేగాక వ్యాఖ్యాత అలీ మీరు చాలా సాఫ్ట్ కదా అని అడిగాడు.
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ సుమన్ నేను మీరు అనుకున్నంత ఎటువంటి సాఫ్ట్ కాదని నాలో ఇంకో యాంగిల్ కూడా ఉందని అది కొంత మంది మాత్రమే చూస్తారని అంటూ సమాధానమిచ్చాడు.అయితే సుమన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యేటువంటి ఆలీతో సరదాగా షో చూడాల్సిందే…
.