పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయ ప్రయాణం సాగిస్తూనే మరో వైపు వరుసగా సినిమాలని లైన్ లో పెట్టారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరిదశకి చేరుకుంది.
ఇప్పుడు మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ ని ప్రారంభించారు.జనవరి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక ఇందులో మరో హీరోగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు.
ఇద్దరి కలయికలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బిల్లా రంగ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్, రానాకి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తుంది.
త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి అందిస్తున్నారు.
ఈ నేపధ్యంలో సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకి మరింత ఇంటెన్సిటీ పెరిగే విధంగా అతని పాత్రని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.త్రివిక్రమ్ ఈ ఎపిసోడ్ మాత్రం సిద్ధం చేశారని తెలుస్తుంది.ఇక ఈ ఎపిసోడ్ పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
ఇక రానా పాత్రని కూడా అంతే పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని, ఇద్దరి మధ్య పోటీ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించాబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తూ ఉండగా రానా కోసం ఐశ్వర్య రాజేష్ ని ఫైనల్ చేశారు.
తమన్ ఈ సినిమాకి మాస్ బీట్స్ అందించనున్నాడు.మరి పవన్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఈ సినిమాలో ఎ స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.