పురాణాల ప్రకారం ప్రతి అమావాస్య కి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఈరోజు వచ్చే అమావాస్య కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈరోజు వచ్చే అమావాస్యను సోమతి అమావాస్య అంటారట.ఈ రోజున ఉపవాసం చేసి రావిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే.సకల దోషాలు తొలగిపోతాయట.
ఈరోజు పెళ్లి అయిన వారితో పాటు పెళ్లి జరగని వారు కూడా రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు కూడా తీరుతాయని ప్రగాఢ విశ్వాసం .అంతేకాకుండా పితృదేవతలకు ఈరోజు వచ్చే అమావాస్య రోజున పిండ ప్రధానం చేయడం లాంటివి చేస్తే పితృ దేవుళ్ళు ఎంతగానో సంతృప్తి చెందుతారట… అంతే కాకుండా మనకు ఎంతో మంచి జరుగుతుందని ఎంతోమంది విశ్వసిస్తారు.
అంతేకాకుండా ఈ అమావాస్య రోజున కొత్త కోడలు చుక్కల అమావాస్య పేరుతో ఒక ప్రత్యేకమైన నోమును నోచుకుంటారట.
గౌరీ పూజ చేసి సాయం సంధ్యవేళలో నిష్టగా ఉపవాసం ఆచరించి దైవాన్ని కొలుస్తారట.ఇక వివాహం జరిగని వారు ఇలాంటి నోము చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుందని ఎంతో విశ్వసిస్తూ ఉంటారట, ఇక పెళ్లయిన వారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలని కోరుకుంటారట.