మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై అందరి చూపు పడింది.లాక్డౌన్ తరువాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న మొదటి బడా చిత్రం కావడంతో అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఈ సినిమా రిజల్ట్పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ట్రైలర్ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే తేజు ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
దర్శకుడు సుబ్బు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా ట్రైలర్లో కనిపిస్తోంది.ప్రేమ, పెళ్లి అంటే పడని తేజు, యూత్ను తన దారిలో వెళ్లేలా చేస్తుంటాడు.
అయితే అతడికి హీరోయిన్ నభా నటేష్ పరిచయం కావడంతో సినిమా కథ ఎలా మలుపు తిరుగుతుందా అనేది ఈ సినిమాలో చాలా ఎంటర్టైనింగ్గా చూపించనున్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ఇక తేజు ఈ సినిమాలో రెచ్చిపోయి నటించాడని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా బ్యాచ్లర్గా తనకు ఎంతో స్పూర్తినిచ్చే నటుడు ఆర్.నారాయణమూర్తి టీవీలో పెళ్లి చేసుకోవాలని యూత్కు చెబుతుండటంతో తేజు ఫ్యూజులు ఎగిరిపోయే కామెడీ సీన్తో ఈ ట్రైలర్ను ముగించాడు దర్శకుడు.
మొత్తానికి ఈ సినిమాతో తేజు మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది.నభా నటేష్ అందంతో పాటు అభినయంతోనూ ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.డిసెంబర్ 25న రిలీజ్ కానున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.