మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.కేవలం కొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉన్న ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా వాయిదా పడింది.ఇక థియేటర్లు తెరుచుకున్న తరువాతే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇప్పటికే పలు ఓటీటీలు ఈ సినిమాకు అదిరిపోయే ఆఫర్లు ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కాగా ఈ సినిమాను ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అంగీకరంచినట్లు తెలుస్తోంది.ఓ భారీ ఆఫర్కు ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాను అక్టోబర్ నెలలో సదరు ఓటీటీ ప్లాట్ఫాంలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాల టాక్.మిగిలి ఉన్న కొంతమేర షూటింగ్ను ముగించేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండగా సుబ్బు అనే డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.