కరోనా కారణంగా ఈ ఏడాది ఆరంభంలో ఒక మూడు నెలలు మినహా మిగిలిన కాలం అంతా లాక్ డౌన్ లోనే పోయింది.థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి.
ఇక ఆరు నెలల పాటు సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.మరల ఓ రెండు నెలల నుంచి షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో మళ్ళీ మామూలుగా సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే సినిమాలు రిలీజ్ అవుతున్న అన్ని కూడా ఒటీటీ బాట పడుతున్నాయి.ఒక్క సినిమా కూడా థియేటర్ లోకి రాలేదు.
థియేటర్లు ఓపెన్ చేయడానికి యాజమాన్యాలు కూడా ముందుకి రాకపోవడంతో అందరూ డిజిటల్ లోకి వెళ్ళిపోతున్నారు.అయితే మరల థియేటర్ లో సినిమాలు చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఈ నేపధ్యంలో డిసెంబర్ నెలలో థియేటర్లు ఓపెన్ చేయడానికి తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు, థియేటర్ యజమానులు సిద్ధం అవుతున్నారు.దీంతో సినిమా రిలీజ్ లు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కొద్దిగా పెద్ద హీరోలలో ముందుగా థియేటర్ లోకి రాబోతుంది సాయి ధరమ్ తేజ్ అని క్లారిటీ వచ్చేసింది.తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా తెరకెక్కింది.
నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేషన్తో డిసెంబర్లో విడుదల చేస్తున్నారు.హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇన్ని రోజులు మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు.ఈ నేపథ్యంలో ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి మేం సిద్ధమవుతున్నాం.
అందులో భాగంగా క్రిస్మస్కు మిమ్మల్ని నవ్వించడానికి అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం అని తెలిపాడు.