మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను సుబ్బు అనే డైరెక్టర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమాను పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంతో ఈ సినిమాతో తేజు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.
కానీ ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.దీంతో ఈ సినిమాను థియేటర్లలో డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో తేజు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనుందని, ఆయన పాత్ర ఆడియెన్స్కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాగా ఈ సినిమాలో తేజు సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే థియేటర్లు తెరుచుకున్న తరువాత రిలీజ్ అవుతున్న తొలి సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ నిలవనుండటం విశేషం.