సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఇప్పటివరకు చిత్ర యూనిట్ ప్రారంభించలేదు.
దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఈ సినిమా కథ ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో ఏ ఒక్క కమర్షియల్ అంశాలన్ని వదలకుండా ఉండేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్, ఇప్పటికే ఈ చిత్ర పాటలకు సంబంధించిన రికార్డింగ్ పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.
కాగా ఈ సినిమాలో ఓ సాలిడ్ ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ పాట థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.థమన్ అదిరిపోయే ట్యూన్స్తో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.కాగా ఈ పాటలో ఓ స్టార్ బ్యూటీ తన అందాలతో పాటు అదిరిపోయే స్టెప్పులు హైలైట్ కానున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ పరంగా అల్ట్రా స్టైలిష్గా ఉండబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ను ప్రస్తుతం హైదరాబాద్లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను అమెరికాలో జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవడంతో ఈ సినిమాకు ఎక్కువ బ్రేకులు లేకుండానే పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.