బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ 24 రోజులు పూర్తి చేసుకొని 25వ రోజులోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే కెప్టెన్సీ పోటీదారుడి కోసం ఈ వారం ఇంటి సభ్యులకు బిగ్ బాస్ `కిల్లర్ కాయిన్స్ టాస్క్` ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ టాస్క్లో మూడు లెవల్స్ నిన్నటితో పూర్తి కాగా.ఎవరూ ఊహించని విధంగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కుమార్ సాయి ఇంటి కెప్టెన్ అయ్యాడు.
అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో మరో ఆసక్తికర విషయం కూడా జరిగింది.కిల్లర్ కాయిన్స్ టాస్క్లో భాగంగా.మొదటి లెవల్లో అమ్మా రాజశేఖర్ మాస్టర్ కాయిన్స్ అన్ని ఎంతో తెలివిగా సోహైల్ కొట్టేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై వారిద్దని మధ్య గొడవ కూడా జరిగింది.
అయితే నిన్నటి ఎపిసోడ్లో.సోహైల్ వచ్చి అమ్మా రాజశేఖర్ మాస్టర్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాడు.
కాయిన్స్ విషయంలో మాస్టర్పై అరవడం కారణంగా.క్షమాపణలు కోరాడు సోహైల్. మీ మీద నాకు ఎటువంటి కోపం లేదని.టాస్క్లో భాగంగానే కాయిన్స్ తీసుకున్నానని సంజాయిషీ చెప్పుకున్నాడు.దీంతో నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అని సోహైల్కు మాస్టర్ హితబోధన చేయడంతో గొడవ సద్దుమణిగింది.అయితే కిల్లర్ కాయిన్స్ రెండో లెవల్లో.
సోహైల్ను తన దగ్గర తీసుకున్న కాయిన్లు వెనక్కి ఇచ్చేయమని కోరతాడు అమ్మా రాజశేఖర్.ఇంతలో మెహబూబ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్కు కాయిన్లు ఇవ్వొదంటూ నూరిపోస్తాడు.
దీంతో సోహైల్ తన కాయిన్స్ అన్నీ.మెహబూబ్కే ఇచ్చేస్తాడు.
అయితే ట్విస్ట్ ఏంటంటే.స్విచ్ కాయిన్ ఉన్న సుజాత మెహబూబ్ వద్ద ఉన్న కాయిన్లు అన్ని లాగేసుకుని.ఫైనల్ లెవల్కు చేరకుంటుంది.మరోవైపు సోహైల్ తన దగ్గర కొట్టేసిన కాయిన్స్ ఇవ్వకపోవడంతో.
కోపంగా ఉంటారు అమ్మా రాజశేఖర్.ఈ క్రమంలోనే మాస్టర్ను తనతో మాట్లాడాలని సోహైల్ కోరగా.
అందుకు నిరాకరిస్తాడు.నా కాయిన్లు ఇచ్చేయమని అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేదని.
నీతో జీవితంలో మాట్లాడనని మాస్టర్ శపథం చేశాడు.ఇక సోహైల్ గేమ్ను గేమ్ లానే ఆడానని, అస్సలు క్షమాపణలు చెప్పాల్సి అవసరం లేదని.
ఇక చెప్పనని తెగేసి చెప్పాడు.దీంతో వీరిద్దరి మధ్య వివాదం మళ్లీ రాజుకుంది.