సినిమాల్లోనే కాదు తెలంగాణ ఎన్నికల్లో కూడా జనాలకు బోలెడంత కామెడీ పంచేసిన బండ్ల గణేష్ అనేక టీవీ ఇంటర్వ్యూ ల్లో శపధాలు మీద శపధాలు చేసేశాడు.ఆవేశం తో ఊగిపోతూ… కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అంటూ… పెద్ద పెద్ద మాటలే చెప్పాడు.
అంతే కాదు….ఇంకా చాలా అన్నాడు.
అయన అన్న మాటలు ఒక్కసారి గుర్తుచేసుకుంటే…
‘డిసెంబర్ 11.ఉదయం 11 గంటల తరువాత నా ఇంటికి రండి.వచ్చేటప్పుడు షార్ప్గా పీక తెగే 7’O Clock బ్లేడ్ తీసుకుని రండి.ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.7’O Clock బ్లేడ్తో పీక కోసుకుంటా.ఇది నా ఛాలెంజ్.
రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్లో పెట్టుకుంటావో.బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటావో నీ ఇష్టం.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం’ అంటూ శపథం చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు అందరికి గుర్తుకొచ్చేస్తున్నాడు.
అంతే కాదు … తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది బండ్ల గణేష్ ఎక్కడ అంటూ సోషల్ మీడియా లో ఒకటే ప్రశ్నలతో నెటిజెన్ లు ప్రశ్నిస్తున్నారు.ఇక అక్కడితో ఆగలేదు ఇదే విషయమై టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా స్పందించారు.ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నాం.
వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.ఇక వారి ప్రగల్భాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నాం’ అంటూ కవిత సెటైర్ వేశారు.