రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అంతా భావించారు, కానీ అనూహ్యంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా సినిమా కనీసం ఆకట్టుకోలేక పోయింది.దాంతో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ లు రెండు సంవత్సరాల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.
సినిమా ప్రమోషన్ సమయంలో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్ చేస్తున్నారు.సత్తా ఉన్న సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది.
ఇలాంటి సినిమాలు కాకుండా మరే సినిమా హిట్ అవుతుంది అంటూ కాస్త ప్రగల్బాలు పలికాడు.
ఇప్పుడు ఆ వ్యాఖ్యలే విజయ్ దేవరకొండకు ఇబ్బందిగా మారాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు మాట్లాడేందుకు ఆసక్తి కనబడచడం లేదు.కానీ తనపై ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ కి భవిష్యత్తులో రాబోతున్న సినిమాలతో సమాధానం చెబుతాను అంటూ బలంగా వారికి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాను అంటూ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరియు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందుతున్న ఖుషి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ మరో సారి తన సత్తా ని బాక్స్ ఆఫీస్ వద్ద చాటడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే మరో సినిమా కూడా రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన ఇప్పటి నుండే అభిమానులు కనిపిస్తోంది.మరోవైపు విజయ్ దేవరకొండ మరియు సుకుమార్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా రూపొందాల్సి ఉంది అది ఎప్పుడు ప్రారంభం అయ్యేది చూడాలి.