ఇటీవల రష్మిక మందన్న తమ సాంప్రదాయంలో ప్రతి పండుగ కు వైన్ తాగడంతో పాటు పంది మాంసంను తింటామని చెప్పింది.పంది మాంసంను కనీసం ఉడికించకుండా నేరుగా కాల్చి తింటామంది.
పంది మాంసం మరియు వైన్ తమ సాంప్రదాయం అంటూ రష్మిక చెప్పడంతో సోషల్ మీడియాలో చర్చ నీయాంశం అయ్యింది.ఇలాంటి సాంప్రదాయాలు ఉంటాయా అంటూ నెటిజన్స్ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సాంప్రదాయంను కొందరు గౌరవిస్తుంటే మరి కొందరు మాత్రం ఆ సాంప్రదాయంను చీల్చి చెండాడుతూ ఉన్నారు.రష్మిక ఏ సమయంలో చెప్పిందో కాని అప్పటి నుండి ఆ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది.
ఈ అమ్మడు గురించి ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
రష్మిక మందన్నా గతంలో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సమయంలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది.
మళ్లీ ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది.ఈమె సాదారణంగా చెప్పిన విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నా కూడా సెలబ్రెటీలు బయటకు చెప్పకుండా ఉండాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి కొన్నాళ్ల పాటు పంది మాంసం వైన్ తో తెగ ట్రోల్ చేసే అవకాశం ఉంది అనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది.
తమిళంలో ఈమె నటించిన సుల్తాన్ సినిమా విడుదల కు సిద్దంగా ఉంది.రెండు కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.