రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో సారి వార్తల్లో నిలిచాడు.ఆయన తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
ఆ సందర్బంగా ఒక రిపోర్టర్ మాట్లాడుతూ ఉండగా తన కాళ్లను టేబుల్ మీద పెట్టి ఆ సీనియర్ రిపోర్టర్ ను అవమానించారు అంటూ విమర్శలు వచ్చాయి.ఆ రిపోర్టర్ ప్రశ్న అడుగుతున్న సమయంలో ఇబ్బంది పడుతున్నట్లుగా ఉన్నావు ఫ్రీ గా ప్రశ్న అడుగు అంటూ విజయ్ దేవరకొండ ఇలా కూర్చో అంటూ టేబుల్ మీద కాళ్లు పెట్టి మరీ చూపించాడు.
ఇది రకరకాలుగా జనాల్లోకి వెళ్లింది.జర్నలిస్ట్ ను అవమానించినట్లుగా కొందరు ప్రచారం చేస్తూ ఉంటే మరి కొందరు మరోరకంగా విజయ్ దేవరకొండ ను ట్రోల్స్ చేస్తున్నారు.
మొత్తానికి విజయ్ దేవరకొండ తీరు పట్ల తీవ్రమైన కోపం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.మీడియా ముందు ఇదేం పని.మినిమం బుద్ది ఉండక్కర్లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ కూర్చున్న విధానం పట్ల చాలా మంది అసంతృప్తి తో ఉన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ యొక్క స్టైల్ ను తీవ్రంగా తప్పబడుతున్నారు.విజయ్ దేవరకొండ చాలా నార్మల్ గానే ఆ విషయంలో మాట్లాడాడు.రిపోర్టర్ కి కంఫర్ట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఆయన అలా ప్రవర్తించాడు.అంతే తప్ప ఆయన్ను విమర్శించే ఉద్దేశ్యం కాని.
అవమానించే ఉద్దేశ్యం కాని విజయ్ దేవరకొండకు లేదు.అయినా కూడా కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని రాద్దాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రచారం చేస్తున్న లైగర్ సినిమా ను కూడా పక్కన పెట్టి ప్రస్తుతం రచ్చ చేస్తున్నారు.ఈ రచ్చ ఎంత వరకు వర్కౌట్ అయ్యేను అనేది చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.