దిషా సంఘటన జరిగినప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖులు స్పందించారు.దిషాకు సత్వర న్యాయం జరగాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.
అన్ని వర్గాల వారు కూడా దిషా కేసు విషయమై నినదించడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.
ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా స్పందించాడు.ఈ ఎన్కౌంటర్ నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని, ఇలా జరిగితే తర్వాత ఇలాంటి నేరాలు చేసేందుకు ఎవరు కూడా సాహసించరు అంటూ ట్వీట్ చేశాడు.
పూరి ట్వీట్ వైరల్ అయ్యింది.అయితే కొందరు మాత్రం పూరి ట్వీట్పై విమర్శలు గుప్పించారు.అసలు ఇలాంటి నేరాలు ఘోరాలు పెరగడానికి కారణ నీలాంటి దర్శకులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మీరు తీసే చెత్త సినిమాలు చూస్తూ, మీరు హీరోలను ఏడిపించే సీన్స్ తీస్తే వాటిని తీసి కొందరు వాటినే ఫాలో అవుతున్నారు.
మరి కొందరు ఒక స్టెప్ ముందుకు వేసి ఏకంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.మీరు ఇలాంటి చెత్త సినిమాలు తీయడం మానేయాలంటూ కొందరు సూచించారు.
మీ సినిమాల్లో ఆడవారిని అంగడి బొమ్మగా చూపిస్తారు.అలాంటి వారు మీరు దిషా సంఘటనపై ఎలా మాట్లాడతారు.
అసలు మీకు ఆ అర్హత ఉందని అనుకుంటున్నారా అంటూ నెటిజన్స్ తీవ్రంగా మండి పడ్డారు.పూరి సినిమాల్లో ఆడవారిని అసభ్యంగా చూపిస్తాడనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడే అదే విషయమై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు.