ప్రపంచం మొత్తం కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రంగాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.విద్యార్థులు, ఉద్యోగులు ఇతర రంగాల వారు అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితం అయిపోయారు.
ఇందులో భాగంగానే సినీ పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు.ముఖ్యంగా ఆటగాళ్లు, సినీ ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు బయటికి ఎక్కడికి వెళ్లకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో వారు వారి అభిమానులను పలకరించడానికి సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు ఆన్ లైన్ లోకి వస్తున్నారు.
అయితే ఈ విషయంలో సామాన్యులు సోషల్ మీడియాను ఒక ఒక టైం పాస్ కోసం ఉపయోగిస్తున్నారు.
సమయం ఖర్చు చేయడానికి ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఇంకా ఇలాంటి సామాజిక సైట్స్ ను ఉపయోగిస్తున్నారు.ఇకపోతే అభిమాన నటులు, అభిమాన క్రీడాకారులు ఎవరైనా సరే వారి అభిమానులతో టచ్ లో ఉండేందుకు ఎప్పటికప్పుడు వారి జీవితంలో జరిగే సన్నివేశాలను వివరిస్తూ తెగ హంగామా చేస్తున్నారు.
రోజురోజుకీ వారి అధికారిక ఖాతాలలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు.వారిని జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగిన వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకొని లక్షల కొద్దీ వ్యూస్, కామెంట్స్ ను పొందుతున్నారు.
అయితే ఇది సామాన్యుల వరకు టైం పాస్ అవ్వగా, అదే సెలబ్రిటీలకు మాత్రం ఆదాయ మార్గంగా మారింది.నిజంగా ఈ కరోనా సమయంలో వారు బయట జీవితంలో సంపాదించే దాని అంటే సోషల్ మీడియా ద్వారా సంపాదించుకున్న డబ్బులు ఎక్కువ అని చెప్పవచ్చు.దీనికి ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ.ఆయన సినిమాలను ప్రత్యేక వెబ్ సైట్ పెట్టి వాటి ద్వారా విడుదల చేసి అతి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు గడించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా లక్షలు, కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నారు.