సోషల్ మీడియా ప్రస్తుతం అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను ఏలేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.జనాలు సోషల్ మీడియాలో ఏం కోరుకుంటున్నారో సినిమా వారు అదే ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్న స్టార్ హీరోలు వారి అభిరుచులకు తగ్గట్లుగా వారి కోరిక అనుసారంగా సినిమాలు చేయడం వాటి పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు.ప్రతి సినిమా విషయంలో కూడా ఈమద్య సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది.
ఒకటి రెండు సందర్బాల్లో సోషల్ మీడియాలో చర్చ జరిగిందని సినిమా మేకర్స్ దానికి తగ్గట్లుగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.అలాంటి సోషల్ మీడియాలో ఇప్పుడు రెండు మల్టీ స్టారర్ ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అదే మెగా బ్రదర్స్ మల్టీ స్టారర్ మరియు ప్రభాస్, యశ్ ల మల్టీ స్టారర్.
ఈ రెండు సినిమాలకు సంబంధించి అభిమానులు ఓ రేంజ్ లో ఆసక్తిని కనబర్చుతున్నారు.ఇటీవలే సలార్ మూవీ షూటింగ్ ను ప్రశాంత్ నీల్ ప్రారంభించిన విషయం తెల్సిందే.ఈ ప్రారంభోత్సవంలో ప్రభాస్ తో పాటు మరో పాన్ ఇండియా స్టార్.
కేజీఎఫ్ హీరో యశ్ కూడా పాల్గొన్నాడు.వీరిద్దరికి ఒకే ఫ్రేమ్ లో చూడటంతో అంతా కూడా వీరిద్దరి కాంబో మల్టీ స్టారర్ మూవీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
వీరిద్దరు సినిమా చేస్తే అది మరో లెవల్ లో ఉంటుందని ప్రశాంత్ నీల్ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సమయంలో ఈ పాన్ ఇండియా స్టార్స్ మల్టీ స్టారర్ గురించి ప్రశాంత్ నీల్ ఆలోచిస్తాడా చూడాలి.ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మల్టీస్టారర్ మూవీ కావాలంటూ మెగా అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు.
మరి అది కూడా సాధ్యమా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.సోషల్ మీడియాలో అభిమానులు బలంగా కోరుకుంటున్నారు కనుక చిరంజీవి ఏమైనా స్పందించే అవకాశం ఉందేమో చూడాలి.
తాజా వార్తలు