ప్రపంచాన్ని గజగజ వణికించిన వైరస్ కరోనా.రోజు రోజుకు పెరుగుతున్న ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ కంటే ముందే కరోనా హాలిడేస్ వచ్చాయి.ఇంకా అప్పటి నుండి వారికీ హాలిడేస్ కొనసాగుతూనే ఉన్నాయ్.
అంతేకాదు జూన్ 11 వరుకు సమ్మర్ హాలిడే అని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది.
ఇంకా ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్కూల్స్, కాలేజీల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
తరగతి గదిలో కూర్చునే విధానం నుండి క్యాంటిన్లు, హాస్టళ్లలో అంత కూడా భౌతిక దూరం పాటించేలా కేంద్ర మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది.కొత్త నిబంధనలను పాఠశాలలకు పాఠశాల శాఖ, కాలేజీలకు యుజిసి రూపొందిస్తాయి.
జోన్లను బట్టి నిబంధనల్లో కొంత సడలింపు ఉంటుంది.అలాగే ప్రార్థనలు, క్రీడలను పూర్తిగా రద్దు చేస్తారని తెలుస్తుంది.
చూశారు కదా.అన్ని మారుతున్నాయి.