స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఎక్కువమంది సమంతదే తప్పు అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.సమంత వల్లే చైతన్య విడాకులకు అంగీకారం చెప్పాల్సి వచ్చిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
సమంత పిల్లల్ని కనకూడదని అనుకున్నారని, సమంత డబ్బు మనిషి అని, సమంత క్యారెక్టర్ గురించి సైతం తప్పుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే రోజులు మారే కొద్దీ సమంత గురించి వెలుగులోకి వస్తున్న విషయాల వల్ల చైతన్య కోసం సమంత ఎన్నో త్యాగాలు చేసిందని జనాలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
విడాకుల ప్రకటన తర్వాత అటు చైతన్య ఇటు సమంత సినిమాలపరంగా బిజీ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు.షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మొదట హీరోయిన్ గా సమంత ఎంపికయ్యారు.
అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కోసమే ఈ పాన్ ఇండియా మూవీలో సమంత ఆఫర్ ను వదులుకున్నారని సమాచారం.
సమంత నో చెప్పడంతో ప్రస్తుతం ఆ సినిమాలో నయనతార నటిస్తున్నారు.పెళ్లి తర్వాత సమంత గ్లామర్ రోల్స్ విషయంలో పరిమితులను విధించుకున్నారు.అక్కినేని ఫ్యామిలీ గౌరవాన్ని పెంచే సినిమాలలో మాత్రమే సమంత ఎక్కువగా నటించడానికి అంగీకరించారు.
హీరోయిన్ గా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్న సమయంలోనే సమంత ఆఫర్లు తగ్గుతాయని తెలిసినా చైతన్యను పెళ్లి చేసుకున్నారు.అయితే చైసామ్ విడిపోవడానికి అసలు కారణం మాత్రం వెలుగులోకి రావడం లేదు.రెండు నెలల క్రితం వరకు అన్యోన్యంగా ఉన్న చైసామ్ జోడీ విడిపోయి నెటిజన్లకు భారీ షాకివ్వడం గమనార్హం. సమంత తాజాగా రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించగా ఆ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
సమంత నటించిన శాకుంతలం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.