తెలుగు సినీ నటుడు మంచు విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోసగాళ్లు సినిమాలో నటించాడు.ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.24 ఫిలిం ఫ్యాక్టరీ,ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కనుంది.
ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా గురించి బుధవారం విలేకరులతో మంచు విష్ణు కొన్ని విషయాలు పంచుకున్నాడు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తిగా భిన్నమైన సినిమా మోసగాళ్లు.ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని తెలిపాడు.
ఇక ఈ కథ ఫస్ట్ డ్రాఫ్ట్ తనే రాశాడట.ఇక దాంట్లో కాస్త స్వేచ్ఛ కూడా తీసుకున్నాడట.
నిజంగా జరిగిన కథ వింటే మాత్రం అందరు షాక్ అవుతారని తెలిపారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం డైమండ్ రత్నబాబు సహాయం తీసుకున్నారని తెలిపారు.ఈ స్క్రిప్ట్ లో 90% యదార్థంగా జరిగిన కథ ఉంటుందని మిగతా 10 శాతమే సినిమాకు తగ్గట్లుగా రాస్తున్నామని తెలిపాడు.ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపిస్తుందని పంచుకున్నాడు.
ఇక తెలుగు వెర్షన్ కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన జత చేశామని తెలిపారు.
ఇదిలా ఉంటే తనకు పెద్ద సపోర్ట్ తన నాన్నే అంటూ ఈ సినిమా విషయంలో తనకన్నా తన ఇంట్లో వాళ్లకి ఎక్కువ టెన్షన్ ఉందని తెలిపాడు.
దీనివల్ల ఒక్కొక్కసారి తన ఇంట్లో వాళ్ళని అనవసరంగా ఒత్తిడిలో కి నెట్టేశానేమోనని తన మీద తనకు కోపం వస్తుందని తెలిపారు.ఇక ఈ విషయం గురించి కథ నచ్చినప్పుడు రిస్క్ తీసుకోక తప్పదు అంటూ చెప్పుకొచ్చాడు.