టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ కి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.
ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్.ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఉన్న పాపులారిటీ మరింత పెరిగింది.
ఇకపోతే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించిన ఉంటే, స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ కి, పిల్లలకు సంబంధించిన వీడియోలను ఫోటోలను, విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
ఇకపోతే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.అంతేకాకుండా అప్పుడప్పుడు తన పిల్లలతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
తాజాగా అల్లు అర్జున్ మామ స్నేహ రెడ్డి తండ్రి అయిన చంద్రశేఖర్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అల్లుడిగా అల్లు అర్జున్ కి వందకు వంద మార్కులు వేస్తానని తెలిపారు.అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.కేవలం మన రెండు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా బయట కూడా అల్లు అర్జున్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, చిరంజీవి అడుగుజాడలో అల్లుఅర్జున్ కూడా ఎంతో కష్ట పడతారు అని చెప్పుకొచ్చారు చంద్రశేఖర్.
ఇక పెళ్లి సమయంలో అల్లు అర్జున్ కి ఎంత కట్నం ఇచ్చారు అని అడగ్గా.బన్నీ అసలు కట్నం తీసుకోలేదని వాళ్లకే ఎక్కువ ఉంది అటువంటిది మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు.
కట్నాలకు వాళ్లు వ్యతిరేకం అంటూ అల్లు అర్జున్ పై ప్రశంశలు కురిపించారు.అల్లు అర్జున్ పై ఆయన మామ చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.