తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి నట సింహం, లెజెండ్ బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు గతంలో చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు.
అయితే ఈ మధ్య ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతేగాక ఈ చిత్రంలో స్నేహ, బాలయ్య బాబు చెల్లెలి పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను అలరించనున్నట్లు కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చర్చించుకుంటున్నారు.గతంలో స్నేహ బాలయ్య బాబు ఇద్దరూ కలిసి “మహారథి” అనే చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు.
అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.అయితే ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ వీరిద్దరూ కలిసి నటించలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక ఇటు బాలయ్య బాబు, అటు దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరు కొంతమేర గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.దీంతో ఈ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.