ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా బుధవారం కనిపించకుండా పోయింది.ఆఫీసుకు నుండి 8 గంటలకు ఆటోలో వెళ్తూ స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంది.
సడెన్గా పెద్దగా కేకలు వేసింది.ఆమె వేసిన కేకలు వేస్తుండగా కొందరు చూసినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆమె కానీ, ఆటోగానీ కనిపించలేదని సమాచారం.అయితే ఆటో కనిపించకుండా పోయిన ప్రాంతంలో సిసి కెమెరాలు పనిచేయలేదు.
ఆమె ఫోన్ సిమ్ కార్డ్ అక్కడ పడి ఉంది.దీంతో పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.
పోలీసులు కేసు చేధించే లోపే ఉద్యోగిని దీప్తి తాను ఢిల్లీలో ఉన్నానంటూ ఫోన్ చేసింది.తాను ఇంటికివస్తున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేసింది.
దీప్తి తల్లిదండ్రులు కూడా తమ కూతురు క్షేమంగా ఉందని, వస్తోందని, ఆమె వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయాలను తెలియజేస్తామని అన్నారు.