ఇంటర్నెట్ వినియోగంతో పాటు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో.ప్రపంచం నలుమూలలా చోటుచేసుకుంటున్న ప్రతి విశేషం నెట్టింట ప్రత్యక్షమవుతుంది.
తమ సమీప ప్రాంతాల్లో జరిగే ప్రతి చిన్న వింత, విశేషాలను పంచుకోవడంలో నెటిజన్లు ముందుంటున్నారు.వారి కారణంగా సోషల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒక కొత్త వీడియోతో వినోదాన్ని పంచుతూనే ఉంటుంది.
అయితే తాజాగా ఒక నెటిజన్ షేర్ చేసిన వీడియో మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ వీడియో చూసి అద్భుతం అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోలో రెండు పాములు జంటగా నృత్యం చేస్తూ కనిపించాయి.వాటి సయ్యాటకు సంబంధించిన వీడియోని అక్షయ శివరామన్ అనే ఒక నెటిజన్ షూట్ చేసింది.
దాన్ని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ట్విట్టర్లో షేర్ చేశారు.దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో రెండు పసుపు రంగు పాములు పైకి లేచి ఎదురుగా నిలబడినట్టు కనిపించింది.భారీ వర్షం కురుస్తుండగా పచ్చని చెట్ల మధ్య ఈ పాములు ఎంజాయ్ చేస్తూ కెమెరాకు చిక్కాయి.
ప్రపంచాన్ని మరిచి రెండు కూడా ఆకట్టుకునే రీతిలో నాట్యం చేశాయి.ఒకే తాళం, లయతో సినిమాలో హీరో హీరోయిన్ డాన్స్ వేసినట్లు ఈ రెండు పాములు నృత్యం చేశాయి.
తమిళనాడులోని తెన్కాశిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.నిజానికి ఇలాంటి దృశ్యాలు జనాలకు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
శ్రీధర్ వెంబు ఈ అదిరిపోయే వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ.‘తెన్కాశిలో పెద్ద వర్షం కురుస్తున్న సమయంలో జంట పాము నృత్యం చేస్తూ కనిపించాయి.అక్షయ రామన్ వాకింగ్ కి వెళ్తూ తన కంటికి కనిపించిన ఈ నాట్యాన్ని ఫోన్ లో చిత్రీకరించింది.ఈ వీడియో షేర్ చేసిన ఆమెకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
సాధారణంగా నల్లత్రాచు, నాగు పాములు నాట్యం చేస్తుంటాయి.కానీ ఈ వీడియోలో రెండు పసుపు పచ్చ పాములు నాట్యం చేస్తూ వావ్ అనిపించాయి.
ప్రస్తుతం ఈ వీడియో పై వేల కామెంట్లు చేస్తూ లైక్ లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు.