లాక్ డౌన్ కదా! ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరు ఏటీఎం నుండి డబ్బు తియ్యలేదు.బయటకు రాలేదు.
అందుకే ఏసీ ఉంది అని ఓ పాము ఏకంగా ఏటీఎంలో చొరబడింది.ఈ ఘటన ఘజియాబాద్లో చోటు చేసుకుంది.
అయితే ఆ పాము బయటకు వచ్చేందుకు చాలా కష్టపడింది.అయితే అది సాధ్యం కాకపోవడంతో ఆ పాము మెల్లగా క్యాష్ డిస్పెన్సింగ్ మెషిన్ వైపు పాకుతూ వెళ్ళింది.
ఇంకా ఇది అంత ఓ వీడియోలో చిత్రీకరణ అయ్యింది.ఇంకా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అంతేకాదు ఈ పాముపై జోకులు కూడా వేస్తున్నారు.లాక్ డౌన్ వేళా పాము కూడా ఆర్ధికంగా నష్టపోయినట్టుంది.
కుటుంబం కోసం ఏటీఎం నుండి డబ్బు దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేశాయి.
ఇంకా ఈ లాక్ డౌన్ వేళా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.
పాములు కూడా ఏటీఎంలో చొరబడుతున్నాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు కూడా ఈ వీడియో ని ఓసారి చూసేయండి.