తాజాగా జరిగిన టీమ్ ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన విషయం అందరికి తెలిసిందే.చివరి వరకు విజయం కోసం పోరాడి చివరికి ఓటమిని చవిచూసింది.
సూర్య కుమార్ క్లాస్ ఇన్నింగ్స్ తోపాటు రోహిత్ శర్మ మాస్ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా అతి కష్టం మీద నెగ్గింది.చివరి వరకు రిషబ్ పంత్ పరుగుల కోసం వేచి చూడక చివరిలో తనదైన ట్రేడ్ మార్క్ షాట్ తో బౌండరీ కొట్టి టీమిండియా కి విజయం అందించాడు.
ఇకపోతే మరోవైపు.ప్రస్తుతం జరుగుతున్న మహిళల బిగ్ బాస్ లీగ్ లో భారత క్రికెటర్ స్మృతి మందాన అదరగొట్టింది.
స్మృతి మందాన కేవలం 64 బంతుల్లో 114 పరుగులతో అజేయంగా నిలిచింది.తాజాగా మెల్ బోర్న్ రెన్ గేడ్స్, సిడ్నీ థన్ డర్స్ మధ్య పోటీ జరిగింది.బోర్న్ రెన్ గేడ్స్ 176 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ థన్ డర్స్ ముందు ఉంచింది.177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థన్ డర్స్ 173 పరుగులు చేసి, 4 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.మందాన తొలి 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసింది.అయితే ఆ తర్వాత పిచ్ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రత్యర్థి బౌలర్లను అటాడుకుంది.ఆకాశమే హద్దుగా చెలరేగి 4 బౌండరీలు, ఒక సిక్సర్ తో కేవలం 31 బంతుల్లోనే అర్థశతకం చేసింది.ఆ తరువాత ధాటిగా ఆడి 57 బంతుల్లోనే సెంచరీ చేసింది.
తహిలా సహాయంతో విజయానికి చేరువగా వెళ్ళింది.
అయితే హర్మన్ ప్రీత్ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా 8 పరుగులు చేసి, 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.మెల్ బోర్న్ రెన్ గేడ్స్ బ్యాట్స్ ఉమెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 55 బంతుల్లో 81 పరుగులు చేయగా.మందాన 57 బంతుల్లో సెంచరీ చేయడం విశేషం.
ఈ మ్యాచ్ లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటారు.